Aryan Khan: ఆర్యన్ ఖాన్ కస్టడీ.. మరికొంత సమయాన్ని కోరిన ఎన్సీబీ
డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు కస్టడీ వ్యవధిని అక్టోబరు 11 వరకు పొడిగించాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్.సి.బి) కోర్టుని కోరింది.
ముంబయి: డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు కస్టడీ వ్యవధిని అక్టోబరు 11 వరకు పొడిగించాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్.సి.బి) కోర్టుని కోరింది. పూర్తి స్థాయిలో విచారించకపోతే ఈ డ్రగ్స్ని ఎవరు సరఫరా చేస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నాయి? అనే విషయాలు ఎలా తెలుస్తాయని, అందుకే మరికొంత సమయం కావాలని విజ్ఞప్తి చేసింది. ముంబయి నగర శివారు తీరప్రాంతంలోని కార్డెలియా క్రూజ్ ఎంప్రెస్ నౌకలో రేవ్ పార్టీ జరుగుతుందన్న విషయం తెలుసుకున్న ఎన్సీబీ అధికారులు దాడులు జరిపి, ఆర్యన్ సహా మరికొందరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ముంబయి కోర్టు ఆర్యన్కి ముందుగా అక్టోబరు 4 వరకు ఎన్సీబీ కస్టడీ విధించింది. ఆ సమయం సరిపోదని ఎన్సీబీ కోర్టుని కోరింది. ఆర్యన్ తరఫున ప్రముఖ న్యాయవాది నతీశ్ మనేషిండే వాదిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.