NIA: ముంద్రాపోర్టు డ్రగ్స్‌ కేసు.. విజయవాడలో ఎన్‌ఐఏ సోదాలు

ముంద్రా పోర్టు డ్రగ్స్‌ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తు ముమ్మరం చేసింది. విజయవాడ, చెన్నై, కోయంబత్తూర్‌లో ఇవాళ ఎన్ఐఏ సోదాలు చేపట్టింది

Updated : 10 Oct 2021 04:07 IST

అమరావతి: ముంద్రా పోర్టు డ్రగ్స్‌ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తు ముమ్మరం చేసింది. విజయవాడ, చెన్నై, కోయంబత్తూర్‌లో ఇవాళ ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. సోదాల్లో భాగంగా ఎన్‌ఐఏ అధికారులు కీలక పత్రాలు, సామగ్రి సీజ్‌ చేశారు. ఇటీవల ముంద్రాపోర్టులో 2,988 కిలోల హెరాయిన్‌ పట్టుబడిన విషయం తెలిసిందే. హెరాయిన్‌ పట్టివేత కేసును రెండ్రోజుల క్రితం ఎన్‌ఐఏ స్వీకరించింది. ఎన్‌డీపీఎస్‌, చట్టవ్యతిరేక చర్యల కింద ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. అఫ్గాన్‌ నుంచి ఇరాన్‌ మీదుగా ముంద్రా పోర్టుకు హెరాయిన్‌ సరఫరా అయినట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు అరెస్టు చేసిన నిందితులను వెంటబెట్టుకుని 3 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. నిందితులుగా ఉన్న మాచవరం సుధాకర్‌,  గోవిందరాజు, రాజ్‌కుమార్‌లకు సంబంధించిన 3 నగరాల్లోని పలు ప్రదేశాల్లో సోదాలు జరిపినట్టు ఎన్ఐఏ వెల్లడించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు