Student: సెలవుల కోసం విద్యార్థి దుస్సాహసం.. మంచినీటిలో పురుగుల మందు కలిపి..
పాఠశాలకు సెలవులు ప్రకటించాలనే ఉద్దేశంతో 11వ తరగతికి చెందిన హాస్టల్ విద్యార్థి మంచినీటిలో పురుగు మందు కలిపి తోటి విద్యార్థులతో తాగించాడు......
భువనేశ్వర్: ఒడిశాలోని బార్గఢ్ జిల్లాలో విస్తుపోయే ఘటన వెలుగుచూసింది. పాఠశాలకు సెలవులు ప్రకటించాలనే ఉద్దేశంతో 11వ తరగతికి చెందిన హాస్టల్ విద్యార్థి మంచినీటిలో పురుగు మందు కలిపి తోటి విద్యార్థులతో తాగించాడు. దీంతో భట్లీ బ్లాక్లోని కామ్గావ్ ఉన్నత పాఠశాలలో కలకలం రేగింది. 11, 12వ తరగతులకు చెందిన 19 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల సిబ్బంది వారందరిని ఆసుపత్రి తరలించారు.
బార్గఢ్ జిల్లా నువాపల్లికి చెందిన విద్యార్థి కామ్గావ్ ఉన్నత పాఠశాలలో 11వ తరగతి చదువుతున్నాడు. కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండటంతో డిసెంబర్ 19 నుంచి ఒడిశాలో లాక్డౌన్ విధిస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త వైరల్గా మారింది. దాన్ని నిజమని నమ్మిన సదరు విద్యార్థి పాఠశాలను మూసేస్తే ఇంటికి వెళ్లొచ్చని సంబరపడ్డాడు. కానీ లాక్డౌన్ లాంటిది ఏమీ లేదని.. సెలవులు రావని తెలుసుకుని కలత చెందాడు. అయినప్పటికీ పాఠశాలను ఎలాగైనా మూసేసేలా చేస్తానని స్నేహితుల వద్ద చెబుతుండేవాడు.
ఈ క్రమంలోనే సదరు విద్యార్థి డిసెంబర్ 8న వాటర్ బాటిల్లో పురుగుమందు కలిపి హాస్టల్లోని తన స్నేహితులకు అందించాడు. అవి తాగిన 19 మంది ఒంట్లో వికారంగా ఉండటం, కళ్లు తిరగడంతోపాటు వాంతులు చేసుకున్నారు. సమాచారం అందుకున్న హాస్టల్ సిబ్బంది.. విద్యార్థులను కామ్గావ్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడినుంచి జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందించిన వైద్యులు ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు. వారిని పరిశీలనలో ఉంచామని పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన పాఠశాల ప్రిన్సిపల్ ప్రేమానంద పటేల్.. సదరు బాలుడిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.