Telugu Akademi Scam: ‘రూ.80 లక్షలు కాల్చేశాను’.. బ్యాంకు మేనేజర్ సాధన పొంతనలేని సమాధానం
తెలుగు అకాడమీ కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు. గుంటూరుకు చెందిన సాంబశివరావును అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు
హైదరాబాద్: తెలుగు అకాడమీ కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు. గుంటూరుకు చెందిన సాంబశివరావును అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు హైదరాబాద్కు తీసుకొచ్చి రిమాండ్కు తరలించారు. కెనరా బ్యాంకు మేనేజర్ సాధనకు సమీప బంధువైన సాంబశివరావు.. డిపాజిట్లు గోల్మాల్ చేసిన ముఠాకు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. వెంకటరమణ అనే వ్యక్తి ద్వారా ప్రధాన నిందితుడు సాయి కుమార్ను పరిచయం చేసుకున్న సాంబశివరావు.. బ్యాంకుల్లోని ప్రభుత్వ శాఖల డిపాజిట్లను కొల్లగొట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ క్రమంలో సాయి కుమార్కు కెనరా బ్యాంకు మేనేజర్ సాధనను సాంబశివరావు పరిచయం చేశారు. ఆ తర్వాత కొల్లగొట్టిన నగదులో సాంబశివరావు తన వాటాగా రూ.50 లక్షలు తీసుకున్నట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు.
ప్రస్తుతం కెనరా బ్యాంకు మేనేజర్ సాధనను సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మూడు రోజుల నుంచి ప్రశ్నిస్తున్నా.. సాధన సరైన సమాధానాలు చెప్పడం లేదని తెలుస్తోంది. నిధులు గోల్మాల్ చేసిన వ్యవహారంలో సాధన దాదాపు రూ.2 కోట్లకుపైగా తన వాటాగా తీసుకున్నట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.
వాటాగా తీసుకున్న దానిలో రూ.80 లక్షలు కాల్చేసినట్లు సీసీఎస్ పోలీసులకు సాధన పొంతన లేని సమాధానం చెప్పారు. అవసరమైతే నోట్లు కాల్చేసిన స్థలానికి క్లూస్ టీంను తీసుకొని ఆధారాలు సేకరించాలనే యోచనలో సీసీఎస్ పోలీసులు ఉన్నారు. రేపటితో ఆమె కస్టడీ ముగుస్తుండటంతో మరో నాలుగు రోజులు కస్టడీ పొడిగించాలని సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా