Crime news: చదివింది పదో తరగతే ... ఆన్‌లైన్‌ మోసాల్లో ఆరితేరారు

సోఫా కొంటానని ఒకరు, స్నేహితుడి పేరుతో ఫేస్‌బుక్‌లో డబ్బులు అవసరం అంటూ మరొకరు ... ఇలా ఓఎల్‌ఎక్స్‌, ఫేస్‌బుక్‌ ద్వారా మోసాలకు పాల్పడుతున్న

Published : 09 Oct 2021 02:04 IST

హైదరాబాద్‌: సోఫా కొంటానని ఒకరు, స్నేహితుడి పేరుతో ఫేస్‌బుక్‌లో డబ్బులు అవసరం అంటూ మరొకరు ... ఇలా ఓఎల్‌ఎక్స్‌, ఫేస్‌బుక్‌ ద్వారా మోసాలకు పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్లను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని అల్వార్‌ జిల్లాకు చెందిన 12మంది సభ్యుల ముఠా సైబర్‌ మోసాలకు పాల్పడుతోంది. సైబరాబాద్‌ పోలీసులు 12 మంది నిందితులను అల్వార్‌లో అరెస్టు చేసి సైబరాబాద్‌ తీసుకొచ్చి జైలుకు పంపారు. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనూ నిందితులపై పలు కేసులు ఉండటంతో కూకట్‌పల్లి కోర్టును పీటీ వారెంట్‌ కోరారు. 12 మందిని అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపర్చి చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌కు తరలించారు. ఓఎల్‌ఎక్స్‌లో వస్తువులు కొంటామని అమాయకులను నమ్మించి బాధితుల ఖాతా నుంచి నగదు లాగేసుకున్నారు. ఫేస్‌బుక్‌ హ్యాక్‌ చేసి ..ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపించి డబ్బులు వసూలు చేసినట్టు కూడా నిందితులపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఇదే ముఠాపై రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోనూ పలు కేసులున్నాయి. ఈ ముఠాలోని సభ్యులు పదో తరగతి వరకే చదివినా.. ఓఎల్‌ఎక్స్‌, ఫేస్‌బుక్‌ హ్యాకింగ్‌ వంటి సైబర్‌ నేరాల్లో ఆరితేరారని పోలీసులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని