Crime news: చదివింది పదో తరగతే ... ఆన్లైన్ మోసాల్లో ఆరితేరారు
సోఫా కొంటానని ఒకరు, స్నేహితుడి పేరుతో ఫేస్బుక్లో డబ్బులు అవసరం అంటూ మరొకరు ... ఇలా ఓఎల్ఎక్స్, ఫేస్బుక్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న
హైదరాబాద్: సోఫా కొంటానని ఒకరు, స్నేహితుడి పేరుతో ఫేస్బుక్లో డబ్బులు అవసరం అంటూ మరొకరు ... ఇలా ఓఎల్ఎక్స్, ఫేస్బుక్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్లోని అల్వార్ జిల్లాకు చెందిన 12మంది సభ్యుల ముఠా సైబర్ మోసాలకు పాల్పడుతోంది. సైబరాబాద్ పోలీసులు 12 మంది నిందితులను అల్వార్లో అరెస్టు చేసి సైబరాబాద్ తీసుకొచ్చి జైలుకు పంపారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ నిందితులపై పలు కేసులు ఉండటంతో కూకట్పల్లి కోర్టును పీటీ వారెంట్ కోరారు. 12 మందిని అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపర్చి చంచల్గూడ జైలుకు రిమాండ్కు తరలించారు. ఓఎల్ఎక్స్లో వస్తువులు కొంటామని అమాయకులను నమ్మించి బాధితుల ఖాతా నుంచి నగదు లాగేసుకున్నారు. ఫేస్బుక్ హ్యాక్ చేసి ..ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి డబ్బులు వసూలు చేసినట్టు కూడా నిందితులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఇదే ముఠాపై రాచకొండ కమిషనరేట్ పరిధిలోనూ పలు కేసులున్నాయి. ఈ ముఠాలోని సభ్యులు పదో తరగతి వరకే చదివినా.. ఓఎల్ఎక్స్, ఫేస్బుక్ హ్యాకింగ్ వంటి సైబర్ నేరాల్లో ఆరితేరారని పోలీసులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు