Khammam: ఖమ్మంలో ఉద్రిక్తత.. ఆర్‌ఎంపీ వైద్యుడి ఇంటిపై దాడి

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చంద్రుతండాలో ఉద్రిక్తత నెలకొంది. చంద్రుతండాలో బోడ భిక్షం కుమారుడు బోడ అర్జున్‌ దశదినకర్మ శనివారం నిర్వహించారు. ఈ కార్యంలో...

Published : 16 Aug 2021 01:48 IST

తిరుమలాయపాలెం: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చంద్రుతండాలో ఉద్రిక్తత నెలకొంది. చంద్రుతండాలో బోడ భిక్షం కుమారుడు బోడ అర్జున్‌ దశదినకర్మ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరి సమీప బంధువులు బోడ హరిదాసు(60), మల్సూరు(57), భద్రు(30) మద్యం తాగి... భోజనం చేస్తూ స్పృహ కోల్పోయి మరణించారు. భోజనంలో విషం కలిపినట్లు అనుమానించి స్థానిక ఆర్ఎంపీ వైద్యుడు చిన్నా ఇంటిపై మృతుల కుటుంబసభ్యులు దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపుచేశారు. అనంతరం గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. బంధువులు తాగిన మద్యంలో సైనైడ్‌ కలిపినట్లు నిర్ధారణ అయింది. పాత కక్షలతోనే ఆర్ఎంపీ వైద్యుడు చిన్నా మద్యంలో సైనైడ్‌ కలిపినట్లు మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. చిన్నా ప్రస్తుతం ఖమ్మం పోలీస్‌ స్టేషన్‌లో పోలీసుల అదుపులో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని