HYD: అత్యాచార ఘటన: ఆ యువతి చేసింది తప్పుడు ఫిర్యాదా?

నగరంలో దారి మళ్లించి, తనపై ఆటో డ్రైవర్‌ అత్యాచారం చేశాడని ఓ యువతి, తల్లిదండ్రులు బుధవారం సంతోష్‌నగర్‌ పోలీసులకు

Updated : 19 Aug 2021 13:37 IST

హైదరాబాద్‌: నగరంలో దారి మళ్లించి, తనపై ఆటో డ్రైవర్‌ అత్యాచారం చేశాడని ఓ యువతి, తల్లిదండ్రులు బుధవారం సంతోష్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులకు ఘటనకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదు. దీంతో యువతి తప్పుడు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పని చేస్తున్న యువతి.. ఈ నెల 17న ఇంటి నుంచి విధులకు వెళ్లింది. అదే రోజు రాత్రి 9.30 గంటలకు ఇంటికి రావాల్సి ఉండగా.. గంట ఆలస్యంగా రాత్రి 10.30 గంటలకు చేరింది. ఆలస్యంగా రావడంతో కుమార్తెను తల్లిదండ్రులు ప్రశ్నించారు.

తనపై ఆటో డ్రైవర్‌ అత్యాచారం చేశాడని యువతి వారికి చెప్పింది. దీంతో యువతితో పాటు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. యువతి ఆటో ఎక్కిన సమయం, ఆమె చెప్పే అంశాలకు పొంతన లేదని నిర్ధరణకు వచ్చారు. యువతిది తప్పుడు ఫిర్యాదుగా భావించిన పోలీసులు ఆమెను పూర్తిస్థాయిలో ప్రశ్నిస్తున్నారు. యువతికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెపై అత్యాచారం జరగలేదని తేలినట్లు సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని