hyderabad news: బంజారాహిల్స్‌లో మసాజ్‌సెంటర్‌పై పోలీసుల దాడి

బంజారాహిల్స్‌లోని ఓ మసాజ్‌ సెంటర్‌పై వెస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారు. అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారనే కారణంతో ఆరుగురు మహిళలు

Updated : 06 Aug 2021 05:27 IST

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని ఓ మసాజ్‌ సెంటర్‌పై వెస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారు. అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారనే కారణంతో ఆరుగురు మహిళలు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబరు 12లోని ఓ మసాజ్‌ సెంటర్‌కు కొందరు వీఐపీలను తీసుకొచ్చి అశ్లీల కార్యకలాపాలు కొనసాగిస్తున్నారనే ముందస్తు సమాచారంతో నిఘా విభాగం అధికారుల సహకారంతో వెస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారని పోలీసులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారిని తదుపరి విచారణ నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించినట్టు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని