HYD: మణికొండలో గల్లంతైన వ్యక్తి.. ఆచూకీ కోసం డ్రోన్తో గాలింపు!
గరంలోని మణికొండలో వరదకు కొట్టుకుపోయిన వ్యక్తి ఆచూకీ రెండు రోజులైనా దొరకలేదు.
హైదరాబాద్: నగరంలోని మణికొండలో వరదకు కొట్టుకుపోయిన వ్యక్తి ఆచూకీ రెండు రోజులైనా దొరకలేదు. సుమారు వంద మంది వరకు ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ఆదివారం రాత్రి వరకు గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో ఈ ఉదయం గాలింపు చర్యలను కొనసాగించాలని నిర్ణయించారు. గల్లంతైంది సాఫ్ట్వేర్ ఇంజినీర్గా అనుమానిస్తున్నారు. ఇవాళ నెక్నాంపూర్ చెరువులో డీఆర్ఎఫ్ బృందాలు డ్రోన్ సాయంతో ఆ వ్యక్తి కోసం గాలించనున్నాయి. ఇందు కోసం చెరువులో గుర్రపు డెక్కను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గుర్రపుడెక్క తొలగింపునకు ఫ్లోటింగ్ జేసీబీని తెప్పించనున్నారు. కాగా, గల్లంతైన వ్యక్తి రజనీకాంత్ అని పోలీసులు వెల్లడించారు. తమకు చూపించకుండా అతను మా కుటుంబ సభ్యుడేనని ఎలా చెబుతారంటూ గల్లంతైన వ్యక్తి కుటుంబ సభ్యులు పోలీసులను ప్రశ్నించారు.
అసలేం జరిగింది..
మణికొండలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద నీరు సెక్రటేరియట్ కాలనీ గోల్డెన్ టెంపుల్ వద్ద నిర్మాణంలో ఉన్న మ్యాన్హోల్లోకి చేరింది. రాత్రి 9.15గం.ల సమయంలో కాలినడకన అటువైపుగా వెళ్తున్న వ్యక్తి అందులో పడి గల్లంతయ్యాడు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న ఓ వ్యక్తి వర్షం వీడియో తీస్తుండగా రికార్డ్ అయ్యింది. ఇది వైరల్ కావడంతో నార్సింగి పోలీసులు, మణికొండ మున్సిపల్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహకారంతో డ్రైనేజి పొడవునా వెదికినా గల్లంతయిన వ్యక్తి ఆచూకీ లభించలేదు. ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండానే పైపులైన్ పనులు చేపడుతున్నా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు వాపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
-
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి