Telugu Akademi Scam: తెలుగు అకాడమీ కుంభకోణంలో దర్యాప్తులో పురోగతి
తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల కుంభకోణంలో పోలీసులు పురోగతి సాధించారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి తెలుగు అకాడమీ అకౌంట్స్ అధికారి రమేశ్ సహా మోసానికి పాల్పడిన..
హైదరాబాద్: తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల కుంభకోణంలో పోలీసులు పురోగతి సాధించారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి తెలుగు అకాడమీ అకౌంట్స్ అధికారి రమేశ్ సహా మోసానికి పాల్పడిన మరో ముగ్గురిని అరెస్టు చేశారు. కాగా, మరో నలుగురు ఏజెంట్లు వెంకట్, రాజ్కుమార్, సాయి, సోమశేఖర్ అనే వ్యక్తులను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది వరకే అరెస్టు చేసిన యూబీఐ చీఫ్ మేనేజర్ మస్తాన్వలీ, ఏపీ మర్కంటైల్ సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణ, మేనేజర్ పద్మావతి, క్లర్క్ మొహిద్దీన్ను రిమాండ్లో ఉన్నారు. ఇవాళ మొహిద్దీన్ను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించనున్నారు.
తెలుగు అకాడమీ అధికారులు మరికొంతమంది కలసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకుల్లో ఉంచిన దాదాపు రూ.60 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను మింగేశారని పోలీస్ అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. ఈ మధ్యాహ్నం ఒంటిగంటకు సీపీ అంజనీకుమార్ వివరాలు వెల్లడించనున్నట్లు సమాచారం. గత నెల ఈ డిపాజిట్లకు అవకతవకలపై అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా మోసం బయటపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్