Crime News: నాన్న కావాలనడమే.. ‘పాప’మైంది
పంజాగుట్టలోని ఓ దుకాణం ముందు దొరికిన బాలిక మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. కన్నతల్లే వివాహేతర బంధం పెట్టుకున్న వ్యక్తితో కలిసి చంపేసినట్లు తేల్చారు. తల్లితో పాటు ఆమె
వీడిన పంజాగుట్ట బాలిక మృతదేహం కేసు మిస్టరీ
వివరాలు వెల్లడిస్తున్న ఏఆర్ శ్రీనివాస్. చిత్రంలో ఇతర పోలీసు అధికారులు (ముసుగులో నిందితులు)
ఆసిఫ్నగర్, న్యూస్టుడే: పంజాగుట్టలోని ఓ దుకాణం ముందు దొరికిన బాలిక మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. కన్నతల్లే వివాహేతర బంధం పెట్టుకున్న వ్యక్తితో కలిసి చంపేసినట్లు తేల్చారు. తల్లితో పాటు ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు. నగర సంయుక్త కమిషనర్, పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ శనివారం ఆయన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. మియాపూర్లోని హఫీజ్పేటకు చెందిన హీనాబేగం(22)కు ఏడేళ్ల క్రితం వివాహమైంది. భర్త ఓ చోరీ కేసులో ఆరు నెలలుగా జైలులో ఉంటున్నాడు. వీరికి కుమారుడు(7), నాలుగు, మూడేళ్ల వయసు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కల్లుకు బానిసైన హీనాబేగం నిత్యం షేక్పేటలోని కల్లు దుకాణానికి వెళ్లేది. ఈ క్రమంలో డబీర్పురా సునార్గల్లీకి చెందిన షేక్ మహ్మద్ ఖాదర్ అలియాస్ రిజ్వాన్తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. పెళ్లి చేసుకుని పిల్లల బాధ్యత తీసుకుంటానని వారిని ముంబయి తీసుకెళ్లాడు రిజ్వాన్. అక్కడి నుంచి దిల్లీ, జైపూర్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో తిరుగుతూ, భిక్షాటన చేసి జీవనం సాగిస్తూ వచ్చారు.
ఇంటికి వెళ్దామమ్మా..: భిక్షాటన చేయడం, తల్లి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండడం పెద్ద కుమార్తెకు నచ్చలేదు. ఇంటికెళ్లి నాన్నను కలుద్దాం.. అంటూ ఆ చిన్నారి మారాం చేయడం మొదలు పెట్టింది. దీంతో కోపగించుకున్న హీనాబేగం, షేక్ మహ్మద్ ఖాదర్ ఈనెల 3న బాలికను తీవ్రంగా కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయింది. చిన్నారిని తీసుకుని ప్రైవేట్ బస్సులో నగరానికి వచ్చారు. ఖైరతాబాద్లో ఆటో ఎక్కి పంజాగుట్ట ద్వారకాపురి కాలనీ వద్ద దిగి మృతదేహాన్ని పడేసి పారిపోయారు. పోలీసులు నిఘా నేత్రాలను పరిశీలించి నిందితులను జేబీఎస్లో అరెస్టు చేశారు. పంజాగుట్ట ఏసీపీ పీవీ గణేశ్, ఇన్స్పెక్టర్ నిరంజన్రెడ్డి, డీఐ కె.నాగయ్య, ఎస్సైలు విజయభాస్కర్ రెడ్డి, నాగరాజు, సతీష్కుమార్, సిబ్బంది కేసును ఛేదనలో తీవ్రంగా శ్రమించారని సంయుక్త కమిషనర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ