Crime News: పంజాగుట్ట బాలికది హత్యే!

నగరంలోని పంజాగుట్టలో ఐదేళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన

Updated : 08 Nov 2021 09:42 IST

కడుపులో బలంగా తన్నడం వల్లే మృతి

హైదరాబాద్‌: నగరంలోని పంజాగుట్టలో ఐదేళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. బాలిక మృతిని పోలీసులు హత్యగా తేల్చారు. కడుపులో బలంగా తన్నడం వల్లే చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. బాలిక మృతదేహాన్ని ఓ మహిళ వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారిని ఎక్కడో చంపేసి నిందితులు ద్వారకాపురి కాలనీలో పడేశారు. నిందితులను సీసీటీవీ కెమెరాల్లో గుర్తించారు. వారు వెళ్లిన మార్గంలో ఉన్న మరిన్ని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం 4 పోలీస్‌, 3 టాస్క్‌ఫోర్స్‌ బృందాలతో గాలిస్తున్నారు. ఈ నెల 4న ద్వారకాపురి కాలనీలో ఐదేళ్ల బాలిక మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని