Crime News: పంజాగుట్ట బాలిక మృతి కేసు.. ఆ మహిళ, వ్యక్తి, బాబు ఎవరు?
పంజాగుట్ట పీఎస్ పరిధిలోని ద్వారకాపురిలో లభించిన చిన్నారి మృతదేహం కేసులో పోలీసుల
హైదరాబాద్: పంజాగుట్ట పీఎస్ పరిధిలోని ద్వారకాపురిలో లభించిన చిన్నారి మృతదేహం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బాలికది హత్యగా తేల్చిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా విచారణ జరుపుతున్నారు. ఓ మహిళ.. వ్యక్తి, బాబుతో కలిసి లకిడీకాపూల్ వైపు నుంచి ఆటోలో వచ్చి ద్వారకాపురిలోని ఓ దుకాణం ముందు ఈ నెల 4వ తేదీన చిన్నారి మృతదేహాన్ని వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కర్ణాటక నుంచి వచ్చిన బస్సులో లకిడీకాపూల్లో దిగిన నలుగురు అక్కడ ఆటో మాట్లాడుకున్నారు. ఓ కుటుంబంలా ఆటోలో వచ్చి ద్వారకాపురి కాలనీలో మృతదేహాన్ని పడేసి మెహదీపట్నం వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. దీంతో పోలీసులు మెహదీపట్నంతో పాటు లకిడీకాపూల్లో ఉన్న ట్రావెల్స్ కార్యాలయాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
బాలిక కడుపుతో పాటు.. వీపుపై గాయాలున్నట్లు ఉస్మానియా ఆస్పత్రి వైద్యుల పోస్టుమార్టం రిపోర్టులో తేలిన విషయం తెలిసిందే. బాలికను పడేసి వెళ్లిన మహిళ, ఆమె వెంట వచ్చిన వ్యక్తి, బాబు ఎవరనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మహిళ ఆచూకీ కోసం 10 పోలీస్ బృందాలతో గాలిస్తున్నారు. ఆమె కర్ణాటక వైపు వెళ్లే అవకాశం ఉండటంతో సరిహద్దు పోలీసులను అప్రమత్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్