Crime News: పంజాగుట్ట బాలిక మృతి కేసు.. ఆ మహిళ, వ్యక్తి, బాబు ఎవరు?

పంజాగుట్ట పీఎస్ పరిధిలోని ద్వారకాపురిలో లభించిన చిన్నారి మృతదేహం కేసులో పోలీసుల

Updated : 09 Nov 2021 16:10 IST

హైదరాబాద్‌: పంజాగుట్ట పీఎస్ పరిధిలోని ద్వారకాపురిలో లభించిన చిన్నారి మృతదేహం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బాలికది హత్యగా తేల్చిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా విచారణ జరుపుతున్నారు. ఓ మహిళ.. వ్యక్తి, బాబుతో కలిసి లకిడీకాపూల్ వైపు నుంచి ఆటోలో వచ్చి ద్వారకాపురిలోని ఓ దుకాణం ముందు ఈ నెల 4వ తేదీన చిన్నారి మృతదేహాన్ని వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కర్ణాటక నుంచి వచ్చిన బస్సులో లకిడీకాపూల్‌లో దిగిన నలుగురు అక్కడ ఆటో మాట్లాడుకున్నారు. ఓ కుటుంబంలా ఆటోలో వచ్చి ద్వారకాపురి కాలనీలో మృతదేహాన్ని పడేసి మెహదీపట్నం వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. దీంతో పోలీసులు మెహదీపట్నంతో పాటు లకిడీకాపూల్‌లో ఉన్న ట్రావెల్స్‌ కార్యాలయాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

బాలిక కడుపుతో పాటు.. వీపుపై గాయాలున్నట్లు ఉస్మానియా ఆస్పత్రి వైద్యుల పోస్టుమార్టం రిపోర్టులో తేలిన విషయం తెలిసిందే. బాలికను పడేసి వెళ్లిన మహిళ, ఆమె వెంట వచ్చిన వ్యక్తి, బాబు ఎవరనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మహిళ ఆచూకీ కోసం 10 పోలీస్ బృందాలతో గాలిస్తున్నారు. ఆమె కర్ణాటక వైపు వెళ్లే అవకాశం ఉండటంతో సరిహద్దు పోలీసులను అప్రమత్తం చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని