crime news: తాడేపల్లి అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు

గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద  కృష్ణానది తీరంలో యువతిపై జరిగిన అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు కృష్ణ కిశోర్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు..

Updated : 07 Aug 2021 19:31 IST

తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద  కృష్ణానది తీరంలో యువతిపై జరిగిన అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు కృష్ణ కిశోర్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని.. గుంటూరు ఎస్పీ ఆరీఫ్‌ ఇవాళ మీడియా ఎదుట హాజరు పర్చారు.

ఈ సందర్భంగా ఎస్పీ ఆరీఫ్‌ మీడియాతో మాట్లాడుతూ..‘‘ నిందితుల అరెస్టు కోసం పోలీసులు చాలా కష్టపడ్డారు. కృష్ణ కిశోర్‌ను విజయవాడ రైల్వే ట్రాక్‌పై పట్టుకున్నాం. నిందితుడికి సంబంధించిన ఆధారాలు దొరకడం ఆలస్యమైంది. సీతానగరం అత్యాచారం కేసులో కృష్ణ కిశోర్‌ ప్రధాన నిందితుడు. అత్యాచార ఘటనకు ముందు నిందితులు ఒక వ్యక్తిని హత్య చేశారు. రాగి తీగలు చోరీ చేయడం చూశాడని శనక్కాయలు అమ్మే వ్యక్తిని హతమార్చారు. ఆ తర్వాత మృతదేహాన్ని నదిలో పడేశారు. మా విచారణలో కృష్ణ కిశోర్‌ హత్య విషయం అంగీకరించాడు. హత్య తర్వాత కృష్ణా నది తీరంలో  ఉన్న జంటను చూశారు. నదీ తీరంలో యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులపై చిల్లర చోరీలు, దాడులు చేసిన నేరాలు ఉన్నాయి. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడు’’ అని ఎస్పీ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని