ఓఆర్‌ఆర్‌ వద్ద యాక్సిడెంట్‌: ఏసీపీ కుటుంబసభ్యులు దుర్మరణం

మేడ్చల్‌ జిల్లా కీసర మండలం యాద్గార్‌పల్లి ఔటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌) వద్ద ప్రమాదం జరిగింది

Updated : 25 Oct 2021 15:10 IST

కీసర: మేడ్చల్‌ జిల్లా కీసర మండలం యాద్గార్‌పల్లి ఔటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌) వద్ద ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏసీపీ కుటుంబసభ్యులు ముగ్గురు మృతిచెందగా..ఒకరికి గాయాలయ్యాయి. మృతుల్లో ఏసీపీ సతీమణి శంకరమ్మ, ఆయన సోదరుడి కుమారుడు భాస్కర్‌ దంపతులు ఉన్నారు. ఏసీపీ సోదరుడు బాలకృష్ణ గాయాలపాలవడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ప్రకాశం జిల్లా చీరాలలో వివాహ వేడుకకు వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని