Road Accident: విద్యార్థులను ఢీ కొట్టి బొలేరో వాహనం బోల్తా.. ఇద్దరి మృతి

విద్యార్థులను ఆటో ఢీకొని ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆదిలాబాద్‌

Updated : 28 Oct 2021 15:10 IST

ఉట్నూరు గ్రామీణం: ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు మండలం షాంపూర్‌ పంచాయతీ పరిధిలోని గోదరిగూడ సమీపంలో బొలేరో వాహనం విద్యార్థులను ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో విద్యార్థి ఉట్నూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మహారాష్ట్రకు చెందిన కొంతమంది బొలేరో వాహనంలో మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం పద్మల్‌పూరి కాకోపెన్‌ దర్శనం కోసం వెళ్తున్నారు. షాంపూర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉదయపు నడకలో భాగంగా రోడ్డు పక్కన వ్యాయామం చేసుకుంటున్నారు. అదే సమయంలో ఇంద్రవెల్లి వైపు నుంచి వచ్చిన బొలేరో ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి విద్యార్థులను ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన జంగు(50) అక్కడి కక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన కిరణ్‌ కుమార్‌, మేఘరాజ్‌తోపాటు నలుగురికి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మేఘరాజ్‌(17) చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు గాదిగూడ మండలం కొత్త పల్లి గ్రామానికి చెందిన విద్యార్థిగా గుర్తించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని