4 రోజుల్లో వివాహం.. పెళ్లి పత్రికలు పంచేందుకు వెళుతూ దుర్మరణం

మరో నాలుగు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు

Updated : 23 Aug 2021 11:33 IST

కదిరి: మరో నాలుగు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. అనంతపురం జిల్లా కదిరి మండలం ఎరుకలవాండ్లపల్లి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఎర్రదొడ్డికి చెందిన మహేష్ (26) మృతి చెందాడు. ఈ నెల 27న కదిరిలో మహేశ్‌ వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి సమయం దగ్గర పడుతుండటంతో బంధువులకు వివాహ పత్రికలను పంచేందుకు స్వగ్రామం నుంచి అర్ధరాత్రి బయలుదేరిన మహేష్ కొద్ది సమయానికే గుర్తుతెలియని వాహనం ఢీకొని మృత్యువాత పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. 
ఉపాధి కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లిన మహేష్ నెల రోజుల కిందటే పెళ్లి కోసం సొంత ఊరికి వచ్చారు. త్వరలో ఓ ఇంటి వాడివై కోడలితో కలిసి జంటగా వస్తావనుకుంటే అందరిని వదిలేసి వెళ్లావా అంటూ బంధువుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని