Road Accident: ఆర్టీసీ బస్సు- కారు ఢీ.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురి మృతి

ఆర్టీసీ బస్సు- కారు ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది.

Published : 05 Dec 2021 12:25 IST

కోరుట్ల గ్రామీణం: ఆర్టీసీ బస్సు- కారు ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. కోరుట్ల మండలం మోహన్‌రావుపేట వద్ద జరిగిన ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోరుట్లలోని బిలాల్‌పుర ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం హైదరాబాద్‌కు వెళ్లి కారులో తిరుగు పయనమ్యారు. కోరుట్ల 10 కిలోమీటర్ల దూరంలో ఉందనగా ఆర్టీసీ బస్సు- కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఘటనలో కారు డ్రైవర్‌ సాజిద్‌ అలీ(45), ఓ చిన్నారి అక్కడికక్కడే మృతిచెందారు. మరో చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని