Road Accident: ప్రైవేటు బస్సు బోల్తా: 17 మందికి తీవ్ర గాయాలు

నిర్మల్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొండాపూర్‌ బైపాస్‌ వద్ద ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది.

Updated : 03 Nov 2021 11:23 IST

నిర్మల్‌ గ్రామీణ: నిర్మల్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొండాపూర్‌ బైపాస్‌ వద్ద ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 15 మంది స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నిర్మల్‌ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు హైదరాబాద్‌ నుంచి యూపీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. డ్రైవర్‌ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నిర్మల్‌ గ్రామీణ ఎస్సై వినయ్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని