Crime News: పండుగ వేళ కృష్ణా జిల్లాలో ఘోర ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి

దీపావళి పండుగ రోజు కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగం ఇద్దరు యువకుల ప్రాణాలు బలిగొంది.

Updated : 05 Nov 2021 11:05 IST

పామర్రు: దీపావళి పండుగ రోజు కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగం ఇద్దరు యువకుల ప్రాణాలు బలిగొంది. వారి తప్పేమీ లేకపోయినా నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటన కృష్ణా జిల్లా పామర్రు మండలం కాపవరం వద్ద గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నం వైపు నుంచి పామర్రు వస్తున్న కారు కాపవరం వద్దకు రాగానే అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. కారు అతివేగంతో వస్తుండడంతో డివైడర్‌ను ఢీకొట్టిన అనంతరం పల్టీలు కొడుతూ ఎదురుగా పామర్రు నుంచి నిమ్మకూరు వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న మొవ్వ మండలం కాజ గ్రామానికి చెందిన కామేశ్వర్‌రెడ్డి (24), మోదుగుమూడి ఉమాకాంత్‌ (20) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్‌లో మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని