AP News: లారీని ఢీకొట్టిన కారు.. తండ్రి, కుమార్తె మృతి

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం మిట్టమీదిపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 

Updated : 16 Aug 2021 12:34 IST

మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం మిట్టమీదిపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమార్తె మృతిచెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టడంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన మరో నలుగురిని గుంటూరు ఆస్పత్రికి తరలించారు. బాధితులు కొండపల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు. అర్ధవీడులో వివాహానికి హాజరై వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని