Crime news: శబరిమల వద్ద ప్రమాదం.. ఇద్దరు కర్నూలు వాసుల మృతి

శబరిమల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  ఈ ప్రమాదంలో కర్నూలులోని బుధవారపేటకు చెందిన ఇద్దరు భక్తులు దుర్మరణంచెందారు. మరో తొమ్మిది

Published : 09 Dec 2021 15:32 IST

శబరిమల: శబరిమల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  ఈ ప్రమాదంలో కర్నూలులోని బుధవారపేటకు చెందిన ఇద్దరు భక్తులు దుర్మరణంచెందారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు.  మృతులను బుధవారపేట, దేవనగర్‌కు చెందిన ఆదినారాయణ, శంకర్‌గా గుర్తించారు. అయ్యప్ప సన్నిధికి టెంపో వాహనంలో వెళ్తుండగా శబరిమలకు 60 కి.మీల దూరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని