Road Accident: విశాఖలో రెండు బైకులు ఢీ.. ముగ్గురు యువకుల మృతి

విశాఖలో కొత్త సంవత్సరం రోజు విషాదం చోటు చేసుకుంది. ఆరిలోవ బీఆర్‌టీఎస్‌ రోడ్డులో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందగా..

Updated : 01 Jan 2022 13:02 IST

విశాఖ: విశాఖలో కొత్త సంవత్సరం రోజు విషాదం చోటు చేసుకుంది. ఆరిలోవ బీఆర్‌టీఎస్‌ రోడ్డులో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందగా.. మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. అతి వేగంగా వచ్చిన రెండు బైకులు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందడం ఆ మార్గంలో వెళుతున్న వారిని కలిచివేసింది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఎలాంటి ప్రమాదాలు, రాస్‌ డ్రైవింగ్‌ జరగకుండా ఉండేందుకు ట్రాఫిక్‌ పోలీసులు నిన్న రాత్రి 8గంటల నుంచి ఈ ఉదయం ఆరు గంటల వరకు ఆరిలోవ బీఆర్‌టీఎస్‌ రహదారిని మూసేశారు. ఆరు గంటల తర్వాత రహదారిని తెరిచిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం జరిగింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని