Road Accident: అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌ పైనున్న లైటింగ్‌ స్తంభాన్ని..

Updated : 13 Aug 2021 18:48 IST

అబ్దుల్లాపూర్‌మెట్‌: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌ పైనున్న లైటింగ్‌ స్తంభాన్ని కారు ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్‌ మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మృతుడు నాగోల్‌ ప్రాంతానికి చెందిన హెచ్ఎండీఏ విశ్రాంత ఉద్యోగి ఎన్‌.మోహన్‌రెడ్డి (72)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని