Road Accident: ట్రావెల్స్‌ బస్సు- టిప్పర్‌ ఢీ: 15 మందికి గాయాలు

విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారి లక్కారం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.

Updated : 23 Sep 2021 10:08 IST

చౌటుప్పల్‌‌: విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారి లక్కారం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సును టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చౌటుప్పల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడినవారిలో ట్రావెల్స్‌ బస్సు, టిప్పర్‌ డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు ఘటనాస్థలంలోనే మరో ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడే ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. లారీ డ్రైవర్‌కు గాయాలు కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. సుమారు 2 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని