NIZAMABAD NEWS: రౌడీషీటర్ బర్త్ డే.. గాల్లోకి కాల్పులు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బర్త్ డే వేడుకలు శృతిమించి పోతున్నాయి. నిన్న అధికార పార్టీకి చెందిన నాయకుడు తన పుట్టిన రోజు వేడుకల్లో తల్వార్తో
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బర్త్ డే వేడుకలు శృతిమించి పోతున్నాయి. నిన్న అధికార పార్టీకి చెందిన నాయకుడు తన పుట్టిన రోజు వేడుకల్లో తల్వార్తో కేక్ కట్ చేయగా, ఇవాళ మరో నాయకుడి బర్త్ డే వేడుకల్లో పిస్తోలు దర్శనమివ్వడం కలకలం సృష్టించాయి.
నగర శివారులోని ఓ ఫామ్హౌస్లో ఆరిఫ్ అనే రౌడీషీటర్ తన బర్త్ డే వేడుకలు ఘనంగా జరపుకొన్నారు. వేడుకల్లో భాగంగా కారుపై కూర్చొని గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరపడం కలకలం రేపింది. దీంతో ఒక్కసారిగా స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఆరిఫ్ పై దోపిడీలు, దొంగతనాల కేసులతో పాటు పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇటీవలే అతను జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యాడు. ఇవాళ తన పుట్టినరోజు వేడుకల్లో రివాల్వర్తో గాల్లోకి కాల్పులు జరపడం ఒక్కసారిగా నగరాన్ని షాక్కు గురి చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.