Crime News: వికారాబాద్‌లో ఆర్టీసీ బస్సు బోల్తా.. 30 మంది ప్రయాణికులకు గాయాలు

వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా తాండూర్‌ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మండల పరిధిలోని కల్కొడ చౌరస్తా వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రమాణికులు తీవ్రంగా గాయపడ్డారు....

Updated : 12 Nov 2021 15:10 IST

మర్పల్లి: వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి నుంచి తాండూర్‌ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మండల పరిధిలోని కల్కొడ చౌరస్తా వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రమాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను మర్పల్లి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మర్పల్లి నుంచి వేర్వేరు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రయాణికులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో వికారాబాద్‌ జిల్లాలోని మలసోమారం, పెద్దాపూర్‌, ఇందోల్‌, తాండూర్‌, సదాశివపేట్‌, మొరంగపల్లి, కొడంగల్‌, జహీరాబాద్‌, పద్దేముల్‌, కేశారం, తదితర గ్రామాలకు చెందిన ప్రయాణికులు గాయపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని