TS News: వ్యక్తిని ఎగిరి తన్నిన సర్పంచ్‌.. వీడియో వైరల్‌

వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం దామస్తపూర్‌లో ఓ వ్యక్తిపై గ్రామ పంచాయతీ సర్పంచ్‌ దాడి చేశారు...

Updated : 22 Sep 2021 13:49 IST

మర్పల్లి: వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం దామస్తపూర్‌లో ఓ వ్యక్తిపై గ్రామ పంచాయతీ సర్పంచ్‌ దాడి చేశారు. గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ను సర్పంచ్‌ జైపాల్‌రెడ్డి కాలితో ఎగిరి తన్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గ్రామ సమస్యలపై ప్రశ్నిస్తే సర్పంచ్‌ దాడి చేశారని శ్రీనివాస్‌ ఆరోపించారు. ఈ ఘటనపై ఆయన ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని