Gang Rape: మేడికొండూరు సామూహిక అత్యాచార ఘటన.. పోలీసుల అదుపులో ఏడుగురు!

గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మహిళపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు ఏడుగురిని

Published : 14 Sep 2021 01:44 IST

మేడికొండూరు: గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మహిళపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. కొర్రపాడుకు చెందిన పాత నేరస్థులను ప్రశ్నిస్తున్నారు. ఈ ఉదయం వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనకు సంబంధించి వీరి ప్రమేయం ఉండొచ్చని విచారణ జరుపుతున్నారు. ఇందులో భాగంగా అనుమానితుల నుంచి ఘటనకు సంబంధించిన ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న సెల్‌ టవర్‌ సిగ్నల్స్‌, సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు వీరిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అయితే పోలీసులు అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని