Crime News: పోలీసుల విచారణలో విలపించిన శిల్ప

పెట్టుబడుల పేరిట కోట్ల రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడిన కేసులో నిందితురాలు శిల్పను మొదటి రోజు పోలీసులు ఐదు గంటల పాటు విచారించారు. ఉదయం 11 గంటల

Updated : 03 Dec 2021 18:32 IST

హైదరాబాద్‌: పెట్టుబడుల పేరిట కోట్ల రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడిన కేసులో నిందితురాలు శిల్పను మొదటి రోజు పోలీసులు ఐదు గంటల పాటు విచారించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆమెను పోలీసులు ప్రశ్నించారు. పోలీసు విచారణలో శిల్ప విలపించినట్టు సమాచారం. ఆమె బినామీలు, బ్యాంకు ఖాతాలపై లోతుగా ఆరా తీశారు. ఇప్పటి వరకు నమోదైన ఫిర్యాదులపై విచారణ జరిపిన పోలీసులు శిల్ప వాంగ్మూలం నమోదు చేశారు. కోట్ల రూపాయలు ఎక్కడికి తరలించిందనే కోణంలోనూ పోలీసులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. రేపు మరోసారి నార్సింగి పోలీసులు ఆమెను విచారించనున్నారు .

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని