Disha encounter case: ఎన్‌హెచ్‌ఆర్సీ బృందంపై సిర్పూర్కర్‌ కమిషన్‌ అసహనం

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో సిర్పూర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సంఘటనా స్థలంలో వివరాలు ఎందుకు సేకరించలేదని జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందంపై సిర్పూర్కర్ కమిషన్ అసహనం వ్యక్తం చేసింది.

Published : 29 Sep 2021 02:03 IST

హైదరాబాద్: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో సిర్పూర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సంఘటనా స్థలంలో వివరాలు ఎందుకు సేకరించలేదని జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందంపై సిర్పూర్కర్ కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. ఎన్‌కౌంటర్ జరిగిన చోట మృతదేహాలు పడి ఉన్న తీరు, పోలీసులు ఎక్కడి నుంచి కాల్పులు జరిపారనే విషయాలు సంఘటనా స్థలంలో సేకరించకుండా పోలీసులు చెప్పిన విషయాలు మాత్రమే ఎందుకు నమోదు చేసుకున్నారని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసిన బృందాన్ని సిర్పూర్కర్‌ కమిషన్‌ ఇవాళ విచారించింది. ఎన్‌కౌంటర్‌ జరిగిన రోజు సంఘటనా స్థలంలో ప్రజలు భారీ సంఖ్యలో గుమిగూడి ఉండటంతో అక్కడికి వెళ్లలేకపోయామని బృంద సభ్యులు వివరించారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకొని మృతదేహాల పంచనామా కూడా పూర్తి చేశారని బృంద సభ్యులు కమిషన్‌కు వివరించారు. రేపు విచారణకు హాజరు కావాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు సిర్పూర్కర్ కమిషన్ సెక్రటరీ ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఎన్‌కౌంటర్‌ జరిగినప్పుడు సజ్జనార్‌ సైబరాబాద్‌ సీపీగా ఉన్న విషయం తెలిసిందే. నిందితుల మృతదేహాలను తీసుకెళ్లిన డ్రైవర్లతో పాటు, డాక్టర్లను కూడా కమిషన్ విచారించే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు