TS News: ర్యాగింగ్ కేసు.. ఆరుగురు వైద్య విద్యార్థుల సస్పెండ్‌

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో

Published : 05 Jan 2022 01:49 IST

సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్‌ను ర్యాగింగ్‌ చేసిన ఆరుగురు వైద్య విద్యార్థులను సస్పెండ్‌ చేశారు. 2019- 20బ్యాచ్‌కు చెందిన విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్‌ చేస్తూ డీఎంఈ రమేశ్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు వసతి గృహం నుంచి శాశ్వతంగా పంపించేస్తూ ఉత్తర్వులిచ్చారు. వైద్యకళాశాల హాస్టల్‌లో హైదరాబాద్‌కు చెందిన మొదటి సంవత్సరం విద్యార్థి విస్కనూరి సాయికుమార్‌ శనివారం రాత్రి ర్యాగింగ్‌కు గురైన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని