Ap news: ప్రకాశం జిల్లాలో పాఠశాల పైకప్పు కూలి విద్యార్థి మృతి

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాజుపాలెంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాల భవనం స్లాబు కూలి విద్యార్థి మృతి చెందాడు...

Published : 30 Aug 2021 01:19 IST

మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాజుపాలెంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాల భవనం స్లాబు కూలి విద్యార్థి మృతి చెందాడు. ఆదివారం సెలవు కావడంతో పలువురు విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో ఆడుకునేందుకు వెళ్లారు. విద్యార్థులు ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా భవనం పైకప్పు కూలడంతో విష్ణు అనే విద్యార్థి మృతి చెందాడు. విష్ణు.. మార్కాపురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నట్టు బంధువులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని