Crime News: మరిదితో కలిసి వివాహిత ఆత్మహత్యాయత్నం.. ఒకరి మృతి

మరిదితో కలిసి ఉరేసుకుని వివాహిత ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన

Published : 26 Oct 2021 01:31 IST

దేవరకద్ర: మరిదితో కలిసి ఉరేసుకుని వివాహిత ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గోపనపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు ఆంజనేయులు రెండో భార్య అర్చన (23) వరుసకు మరిది అయ్యే మధు(22)తో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ విషయం ఇతరులకు తెలియడంతో మనస్థాపానికి గురైన ఆ ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి ఓకే చీరకు ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో అర్చన మృతి చెందింది. మధు పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని