Telugu Akademi Scam: 12ఏళ్లలో రూ.200 కోట్లు కొల్లగొట్టిన సాయి ముఠా
తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల గోల్మాల్ కేసులో సీసీఎస్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ప్రధాన నిందితుడు సాయి
హైదరాబాద్: తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల గోల్మాల్ కేసులో సీసీఎస్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ప్రధాన నిందితుడు సాయి కుమార్ గత 12ఏళ్లలో దాదాపు రూ.200 కోట్లు కొల్లగొట్టినట్లు సీసీఎస్ పోలీసులు తేల్చారు. ఏపీ హౌజింగ్ బోర్డులో రూ.40 కోట్లు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో రూ.15 కోట్లు, మైనార్టీ సంక్షేమ శాఖలో రూ.45 కోట్లు, ఏపీ సీడ్స్ కార్పొరేషన్లకు సంబంధించిన రూ.15 కోట్ల డిపాజిట్లను దారి మళ్లించి విత్ డ్రా చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. తెలుగు అకాడమీకి చెందిన రూ. 64.5 కోట్లను ఏపీ మర్కంటైల్ సొసైటీ ఖాతాకు మళ్లించి వాటాలుగా పంచుకున్న నిందితులు.. గత పదేళ్లలో సుమారు రూ. 200 కోట్లను పంచుకున్నట్లు సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మేరకు తగిన ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. సాయి కుమార్ వెనక ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో సీసీఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు సాయి, అతని అనుచరులు కలిసి రూ.కోట్లలో ప్రభుత్వ సంస్థల ఎఫ్డీలు స్వాహా చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. 12 ఏళ్ల క్రితం సాయికుమార్, అతని అరుచరులు ముఠాగా ఏర్పడ్డారు. వీరిపై ఇప్పటికే 7 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోనూ మరో 2 ప్రభుత్వం శాఖల ఎఫ్డీలనూ సాయి ముఠా కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో స్వాట్ కంప్యూటర్స్ పేరిట సాఫ్ట్వేర్ కంపెనీని సాయి నిర్వహించేవారు. చెన్నైకి చెందిన కొంత మంది నేరగాళ్లతో సాయికి పరిచయం ఏర్పడింది. బ్యాంకు అధికారులతో పరిచయాలు పెంచుకొని ఎఫ్డీల గోలమాల్కు తెరలేపారు. జాతీయ, కార్పొరేట్, సహకార బ్యాంకుల మేనేజర్లతో పరిచయాలు పెంచుకున్న సాయి.. ఎఫ్డీల సొమ్మును కాజేసేందుకు వ్యూహాలు చేశారు. అంతేకాకుండా కమీషన్ల ఆశ చూపించి ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి ఎఫ్డీల సొమ్మును స్వాహా చేశారు. ఒప్పందం చేసుకున్న బ్యాంకుల్లోనే ప్రభుత్వ శాఖల ఎఫ్డీలు కాజేసేలా వ్యూహాలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ప్రధాన నిందితుడు సాయి కుమాకర్తో పాటు 9 మంది నిందితుల కస్టడీ నేటితో ముగియడంతో వారిని ఈ రోజు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించారు. దర్యాప్తులో పురోగతి, నిందితులు పంచుకున్న వాటాలపై పూర్తి సమాచారం తెలుసుకునేందుకు 9 మంది నిందితులను మరో నాలుగు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టును కోరారు. దీనిపై వాదనలను న్యాయమూర్తి ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు. ఈ నెల 9వ తేదీన అరెస్ట్ చేసిన వినయ్ కుమార్, రమణారెడ్డి, భూపతిలను నాంపల్లి కోర్టు నాలుగు రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ నెల 16వ తేదీన నిందితులను సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్