Suicide: మీర్‌పేట్‌లో విషాదం.. ఫోన్‌లో గేమ్స్‌ ఆడొద్దన్నందుకు విద్యార్థిని ఆత్మహత్య

చరవాణి ఎక్కువగా వినియోగిస్తున్నావంటూ తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన కుమార్తె ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని మీర్‌పేట్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

Updated : 04 Oct 2021 13:13 IST

బాలాపూర్‌: చరవాణి ఎక్కువగా వినియోగిస్తున్నావంటూ తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన కుమార్తె ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని మీర్‌పేట్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మీర్‌పేట్‌ సర్వోదయ నగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మొదటి కుమార్తె (17) ఇంటర్మీడియట్‌ చదువుతోంది. ఆదివారం రాత్రి ఫోన్‌లో గేమ్స్‌ ఆడుతుండగా తండ్రి ఆమెను మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని రాత్రి తన గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఉదయం ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో కిటికీ అద్దాలను పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. కుటుంబ సభ్యులు మీర్‌పేట్‌ పోలీసులకు సమాచారం అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌ రెడ్డి తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని