Crime News: వార్దా నదిలో పడవ బోల్తా.. 11 మంది గల్లంతు

మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని గాలేగావ్‌ సమీపంలో వార్దా నదిలో..

Updated : 14 Sep 2021 15:34 IST

అమరావతి(మహారాష్ట్ర): మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని గాలేగావ్‌ సమీపంలో వార్దా నదిలో పడవ బోల్తా పడి 11 మంది గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురి మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. గల్లంతైన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఆ పడవలో 30కి పైగా మంది ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పడవ మునిగిపోవడాన్ని గుర్తించిన స్థానికులు అక్కడకు చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.  అధికారులకు సమాచారం అందించారు. పడవలోని 11 మంది గల్లంతుకాగా.. ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. అధిక బరువు కారణంగానే పడవ మునిగిపోయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని