Crime News: కారు అద్దాల ధ్వంసం.. రూ.25 లక్షల చోరీ
నిలిపి ఉన్న కారు అద్దాలను ధ్వంసం చేసి ఓ వ్యక్తి అందులోని రూ.25 లక్షల నగదును దోచుకెళ్లాడు. ఈ ఘటన సోమవారం పట్టపగలు హనుమకొండ పట్టణంలో జరిగింది. హనుమకొండ సుబేదారి ఇన్స్పెక్టర్ రాఘవేందర్
హనుమకొండలో పట్టపగలు ఘటన
వరంగల్క్రైం, న్యూస్టుడే: నిలిపి ఉన్న కారు అద్దాలను ధ్వంసం చేసి ఓ వ్యక్తి అందులోని రూ.25 లక్షల నగదును దోచుకెళ్లాడు. ఈ ఘటన సోమవారం పట్టపగలు హనుమకొండ పట్టణంలో జరిగింది. హనుమకొండ సుబేదారి ఇన్స్పెక్టర్ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని జులైవాడకు చెందిన కె.తిరుపతి స్థిరాస్తి వ్యాపారం చేస్తుంటారు. సోమవారం మధ్యాహ్నం హంటర్ రోడ్డులోని ఎస్బీఐ బ్యాంకు నుంచి రూ. 5 లక్షలు, నక్కలగుట్టలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి రూ.20 లక్షల నగదు విడిపించారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి నగదుతో బయటకు వచ్చిన తిరుపతి.. మొత్తం రూ.25 లక్షలను కారులో పెట్టారు. అనంతరం బ్యాంకు సిబ్బంది పిలవడంతో లోపలికి వెళ్లారు. వారు సూచించిన పత్రాలపై సంతకం చేసి బయటకు వచ్చే సరికి కారు ముందటి కిటికీ అద్దం పగులగొట్టి ఉంది. అనుమానంతో వాహనంలో పరిశీలించగా అందులో ఉంచిన రూ. 25 లక్షలు కనిపించ లేదు. వెంటనే ‘డయిల్ 100’కు ఫోన్ చేయడంతో స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. అనంతరం సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించి అనుమానితుడిని గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా