Crime News : పులివెందులలో దొంగల బీభత్సం.. 

కడప జిల్లా పులివెందులలో దొంగలు బీభత్సం సృష్టించారు. మూడు చోట్ల చోరీలకు పాల్పడ్డారు. స్థానిక భాకరాపురంలోని

Updated : 13 Sep 2021 14:46 IST

పులివెందుల: కడప జిల్లా పులివెందులలో దొంగలు బీభత్సం సృష్టించారు. మూడు చోట్ల చోరీలకు పాల్పడ్డారు. స్థానిక భాకరాపురంలోని పాల కేంద్రం సమీపంలో నివసిస్తున్న లక్ష్మీదేవి అనే మహిళ ఇంట్లోకి చొరబడిన దుండగులు.. ఆమెను కత్తితో బెదిరించి కాళ్లు, చేతులు కట్టేశారు. ఆపై ఆమె చెవి దుద్దులు, బంగారు గొలుసు, బీరువాలో ఉన్న రూ.75వేల నగదు దోచుకెళ్లారు. అనంతరం ఆ ఇంటి సమీపంలో నిలిపి ఉంచిన రెండు ద్విచక్ర వాహనాలను కొంతదూరం వరకు తీసుకెళ్లి మధ్యలోనే వదిలి వెళ్లిపోయారు.

వీటితో పాటు పట్టణంలోని పార్నపల్లె రోడ్డు మార్గంలోని ఓ దుకాణంలో చోరీకి విఫలయత్నం చేశారు. గమనించిన స్థానికులు కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు లక్ష్మీదేవి ఇంటికి వెళ్లి పరిశీలించి ఆమెను విచారించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని