TS News: అయ్యో.. తమ్ముళ్లను బడికి తీసుకెళ్తూ ప్రమాదం: ముగ్గురు అన్నదమ్ముల మృతి

మెదక్‌ జిల్లా చేగుంట సమీపంలో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందారు.

Published : 21 Dec 2021 01:37 IST

చేగుంట: మెదక్‌ జిల్లా చేగుంట సమీపంలో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందారు. మండలంలోని ఉల్లి తిమ్మాయపల్లికి చెందిన రాకేశ్‌ (20), ప్రదీప్‌ (15), అరవింద్‌ (14) అన్నదమ్ములు. ప్రదీప్‌, అరవింద్‌ చేగుంటలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. ఇవాళ ఉదయం రాకేశ్‌ తన తమ్ముళ్లిద్దరినీ ద్విచక్ర వాహనంపై పాఠశాలకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో చేగుంట సమీపంలోకి రాగానే ద్విచక్ర వాహనం అదుపుతప్పి లారీని ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో రాకేశ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన ప్రదీప్‌, అరవింద్‌ స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ చనిపోయారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై సుభాష్‌ గౌడ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని