Crime News: ఖమ్మంలో విషాదం... సాగర్‌ కాలువలో ముగ్గురి గల్లంతు

ఖమ్మంలో విషాదం చోటు చేసుకుంది. దానవాయిగూడెం వద్ద సాగర్‌ కాలువలో ఈతకు వెళ్లి ముగ్గురు గల్లంతయ్యారు.

Published : 20 Dec 2021 01:11 IST

ఖమ్మం: ఖమ్మంలో విషాదం చోటు చేసుకుంది. దానవాయిగూడెం వద్ద సాగర్‌ కాలువలో ఈతకు వెళ్లి ముగ్గురు గల్లంతయ్యారు. ఈ రోజు సాయంత్రం కాలువలో ఈతకొట్టేందుకు ఏడుగురు వెళ్లగా అందులో ముగ్గురు ప్రవాహంలో కొట్టుకుపోయారు. గల్లంతైన వారు కేరళ రాష్ట్రానికి చెందిన వివేక్‌, అభయ్‌, సోనూగా గుర్తించారు. వీరంతా ఖమ్మంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని