Road Accident: పెళ్లి చూపులకు వెళ్లొస్తూ ప్రమాదంలో ముగ్గురి మృతి
పెళ్లి చూపులకు వెళ్లి వస్తూ యువకుడితోపాటు మరో ఇద్దరు మృతి చెందిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద చోటు చేసుకుంది. ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన బేతా సూరిబాబు (26) పెళ్లిచూపులకు బంధువులతో కలిసి కారులో ఆదివారం రాజమహేంద్రవరం వెళ్లారు. కార్యక్రమం పూర్తయ్యాక తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో వీరు ప్రయాణిస్తున్న...
నల్లజర్ల, న్యూస్టుడే: పెళ్లి చూపులకు వెళ్లి వస్తూ యువకుడితోపాటు మరో ఇద్దరు మృతి చెందిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద చోటు చేసుకుంది. ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన బేతా సూరిబాబు (26) పెళ్లిచూపులకు బంధువులతో కలిసి కారులో ఆదివారం రాజమహేంద్రవరం వెళ్లారు. కార్యక్రమం పూర్తయ్యాక తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు అనంతపల్లి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బేతా గోవిందరావు(65), భీమడోలు మండలం కొండ్రుపాడుకు చెందిన కారు డ్రైవరు జక్కుల శివాజీ (28) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలైన సూరిబాబును ఏలూరు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాదంలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!