Crime news: ‘అనంత’లో విషాదం.. చెరువులో మునిగి ముగ్గురు విద్యార్థులు గల్లంతు

అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అమడగూరు మండలంలోని ములకవారిపల్లితండాలో చెరువులోకి మునిగి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. ......

Updated : 12 Oct 2021 15:22 IST

అనంతపురం: అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అమడగూరు మండలంలోని ములకవారిపల్లితండాలో చెరువులో మునిగి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. చెరువులోకి దిగిన చిన్నారులు.. ప్రమాదవశాత్తు గల్లంతు కావడంతో వారి ఆచూకీ కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు.  గల్లంతైనవారిలో లాలూ ప్రసాద్ నాయక్ నాలుగో తరగతి చదువుతుండగా.. పురుషోత్తం నాయక్ ఆరో తరగతి, హేమంత్ నాయక్ ఏడో తరగతి చదువుతున్నారు. దసరా సెలవుల నేపథ్యంలో సరదాగా చెరువు వైపు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు నీటిలో దిగి ప్రమాదవశాత్తు మునిగిపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సోమవారం సాయంత్రం వరకు విద్యార్థులకు సంబంధించి ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఒకే తండాకు చెందిన ముగ్గురు విద్యార్థులు చెరువులో మునిగి గల్లంతు కావడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని