Crime News: తాళ్లతో కట్టుకొని కుమార్తెతో సహా చెరువులో దూకిన దంపతులు

మెదక్‌ జిల్లా బొల్లారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తాళ్లతో కట్టుకొని ముగ్గురు కుటుంబీకులు చెరువులో దూకేశారు..

Updated : 30 Aug 2021 05:30 IST

బొల్లారం: మెదక్‌ జిల్లా బొల్లారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తాళ్లతో కట్టుకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చెరువులో దూకారు. వారిలో భర్త శ్రీనివాస్ (40), కుమార్తె కృతి (11) మృతి చెందారు. శ్రీనివాస్‌ భార్య లావణ్యను గ్రామస్థులు కాపాడారు. వెంటనే ఆమెను మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం లావణ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శ్రీనివాస్‌ బొల్లారంలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని