Crime News: తక్కువ ధరకే బంగారం.. విజయవాడలో భారీ మోసం
భారతీయులు.. ముఖ్యంగా దక్షిణ భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ తక్కువ ధరకే బంగారం వస్తుందంటే కాదనేవారు ఉండరు
విజయవాడ: భారతీయులు.. ముఖ్యంగా దక్షిణ భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ తక్కువ ధరకే బంగారం వస్తుందంటే కాదనేవారు ఉండరు. ఈ ఇస్టాన్నే ఇద్దరు ఘరానా మోసగాళ్లు అవకాశంగా మలుచుకున్నారు. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని చెప్పి 57 మందిని మోసం చేశారు. బాధితుల నుంచి దాదాపు రూ.8 కోట్లు వసూలు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రైల్వే ఉద్యోగి వెంకటేశ్వరరావు, నాగమణి గత 13 ఏళ్లుగా నగరంలో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. నిందితులు ఆన్లైన్ రమ్మీలో రూ. 1.32 కోట్లు పోగొట్టుకున్నారు. పోయిన డబ్బును సంపాదించాలని నిందితులిద్దరూ పథకం వేసుకున్నారు. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని చెప్పి కొంత మంది నుంచి డబ్బులు వసూలు చేశారు. అధిక వడ్డీ ఇస్తామని చెప్పడంతో మరి కొంత మంది బంగారం కూడా ఇచ్చారు. ఇలా రైల్వేలో పనిచేసే టీటీఈలు, దుర్గ గుడి ఉద్యోగులతో కలిపి మొత్తంగా 57 మంది నుంచి దాదాపు రూ.8 కోట్లు డబ్బు వసూలు చేశారు. డబ్బులు ఇచ్చిన వాళ్లు బంగారం అడగడంతో వ్యవహారం తెరపైకి వచ్చింది. బాధితులు వేధిస్తున్నారంటూ నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడంతో జరిగిన మోసం వెలుగులోకి వచ్చింది. బాధితుల నుంచి తీసుకున్న బంగారాన్ని నిందితులు ఓ ప్రైవేటు బ్యాంకులో తాకట్టు పెట్టారు. నాగమణిని పోలీసులు అరెస్టు చేయగా.. వెంకటేశ్వరరావు రైల్వే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై మోసపోయిన బాధితులెవరూ ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు