ap news: ప్రైవేటు బస్సులో తరలిస్తున్న 2కిలోల బంగారం స్వాధీనం

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్‌ప్లాజా వద్ద ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తున్న రెండు కేజీల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ...

Published : 26 Jul 2021 02:01 IST

గన్నవరం: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్‌ప్లాజా వద్ద ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తున్న రెండు కేజీల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పోలీసులు రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బస్సులో తనిఖీలు నిర్వహించి బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారం తీసుకెళ్తున్న వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన సాహిల్‌ బొర్డియాగా గుర్తించారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా బంగారు ఆభరణాలు తరలించడంపై కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్టు  గన్నవరం సీఐ శివాజీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని