Crime News: ఉర్సు ఉత్సవ ఏర్పాట్లపై ఘర్షణ.. ఇద్దరు మృతి

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం గుండాల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో నిర్వహించనున్న ఉర్సు ఉత్సవాల్లో డీజే ఏర్పాటు విషయమై ఇరు వర్గాల మధ్య

Updated : 28 Oct 2021 04:47 IST

ఇచ్చోడ: ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం గుండాల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో నిర్వహించనున్న ఉర్సు ఉత్సవాల్లో డీజే ఏర్పాటు విషయమై ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. గ్రామంలో ఏటా ఉర్సు ఉత్సవాన్ని గ్రామస్థులు వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా ఉత్సవం నిర్వహించేందుకు బుధవారం రాత్రి గ్రామంలోని ఓ వర్గం వారు ఏర్పాట్లు చేపట్టారు. ఏర్పాట్లలో భాగంగా డీజే విషయమై మరో వర్గం వారితో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ తారస్థాయికి చేరడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఇద్దరు మృతి చెందగా.. పది మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలంలో భారీగా మోహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని