crime news: నమ్మించి.. చెరువులో ముంచి ఇద్దరి హత్య

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ రాకాసిపేట శివారులో దారుణం చోటుచేసుకుంది. శివ, నర్సింహుల అనే ఇద్దరు అన్నదమ్ములను వారి పెదనాన్న కుమారుడు వెంకట్‌ బెల్లాల్‌ చెరువులో

Published : 10 Aug 2021 17:40 IST

బోధన్‌: నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ రాకాసిపేట శివారులో దారుణం చోటుచేసుకుంది. శివ, నర్సింహుల అనే ఇద్దరు అన్నదమ్ములను వారి పెదనాన్న కుమారుడు వెంకట్‌ బెల్లాల్‌ చెరువులో తోసేసి హతమార్చాడు. పోలీసుల కథనం ప్రకారం.. వారం రోజుల క్రితం శివ, వెంకట్‌కి చిన్నపాటి గొడవ జరిగింది. శివ, నర్సింహులకు మాయమాటలు చెప్పిన వెంకట్‌.. బెల్లాల్‌ చెరువు వద్ద మద్యం తాగించాడు. అనంతరం ఒకరి తర్వాత ఒకరిని చెరువులో తోసేసి హత్య చేశాడు. తొలుత శివను చెరువులో తోసేసిన వెంకట్‌.. అతడి ప్రాణం పోయిందని నిర్ధారించుకున్న తర్వాత నర్సింహులును కూడా అదే తరహాలో హత్య చేశాడు. వెంకట్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్నదమ్ముల మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులు, బంధువుల రోధనలు మిన్నంటాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని