TS News: జగిత్యాల చెరువులో ఇద్దరు యువతుల మృతదేహాలు

జగిత్యాలలోని ధర్మసముద్రం చెరువులో ఇద్దరు యువతుల మృతదేహాలు కలకలం రేపాయి

Published : 29 Oct 2021 02:20 IST

జగిత్యాల: జగిత్యాలలోని ధర్మసముద్రం చెరువులో ఇద్దరు యువతుల మృతదేహాలు కలకలం రేపాయి. గంగాజల, మల్లిక మృతదేహాలను గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఉప్పరిపేటలో నిన్న ముగ్గురు యువతులు అదృశ్యం కాగా.. వారిలో ఇద్దరు యువతుల మృతదేహాలుగా వీటిని పోలీసులు అనుమానిస్తున్నారు. మరో యువతి వందన కోసం గాలిస్తున్నారు. అదృశ్యమైన ముగ్గురు యువతులు ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ యువతులు ఒకే వీధిలో నివసించేవారని సమాచారం.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని