Crime news: చాంద్రాయణగుట్టలో పట్టపగలు నడిరోడ్డుపై దారుణహత్య

పాతబస్తీ చాంద్రాయణగుట్టలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి చాంద్రాయణగుట్ట నుంచి హీషీమాబాద్‌ వైపు కారులో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కారును

Updated : 14 Oct 2021 13:10 IST

హైదరాబాద్‌: పాతబస్తీ చాంద్రాయణగుట్టలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి చాంద్రాయణగుట్ట నుంచి హీషీమాబాద్‌ వైపు కారులో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కారును అడ్డుకున్నారు. కారులో ఉన్న వ్యక్తిని బయటకు లాగి నడిరోడ్డుపై కత్తులతో నరికి చంపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన వ్యక్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పట్టపగలు నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని